Gold Price: భగ్గుమంటున్న బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,730కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,800కి చేరింది. కిలో వెండి రూ. 1,49,200గా ఉంది. పసిడి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి, సామాన్యులకు ఇది ఆందోళన కలిగిస్తోంది.
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,730కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,800గా నమోదైంది. అదే సమయంలో, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,49,200 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర త్వరలోనే రూ. 2,00,000 మార్కును చేరే అవకాశం ఉందని మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు తన చరిత్రలోని అత్యధిక స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ప్రక్రియ ప్రారంభం
Alia Bhatt: ఇంట్రస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆలియా
