Vizag: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్.. కూటమి అభ్యర్థిపై కొనసాగుతోన్న ఉత్కంఠ

|

Aug 12, 2024 | 4:36 PM

విశాఖ స్థానిక సంస్థల వైసీపీ MLC అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. 838 ఓట్లలో 500కు పైగా ఓట్లు YCPకే ఉన్నాయన్నారు బొత్స సత్యనారాయణ.

విశాఖ స్థానిక సంస్థల వైసీపీ MLC అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. 838 ఓట్లలో 500కు పైగా ఓట్లు YCPకే ఉన్నాయన్నారు బొత్స సత్యనారాయణ. టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్యే అన్నారు బొత్స.

మరోవైపు టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే.. MLC ఉప ఎన్నికలో గెలుపు ఖాయమని కూటమి నేతలు భావిస్తున్నారు. నిన్న జరిగిన భేటీలో దీనిపైనే ప్రధానంగా చర్చిచారు. ఈ క్రమంలోనే బైరా దిలీప్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల అభిప్రాయాలతో హైకమాండ్‌కి ఇప్పటికే రిపోర్ట్ పంపించారు. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండడంతో.. అభ్యర్థిని ఫైనల్‌ చేయనున్నారు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on