Mulugu: పొలానికి వెళ్తుండగా కనిపించిన ఏదో ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా.!
ఆ గ్రామంలోని రైతులు ఎప్పటిలానే రోజూ తెల్లారేసరికి తమ గడ్డిపార, పనిముట్టు సామాన్లు పట్టుకుని పొలానికి బయల్దేరారు. వారంతా కూడా వారి ఇళ్ళ దగ్గర నుంచి కొంతదూరం వెళ్లేసరికి రోడ్డువైపు ఒక పక్కన ఏదో ఆకారంలా కనిపించింది. దూరంగా ఉన్నారు కాబట్టి అది ఏంటో వారికీ అర్ధం కాలేదు. కొంచెం దగ్గరకు వెళ్లారు. ఏంటని చూడగా దెబ్బకు షాకయ్యారు.
ములుగు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. స్థానిక వెంకటాపురం మదలం బెస్తగూడెం గ్రామ శివారులో రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. ఘటనాస్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు క్షుద్రపూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లను గ్రామస్తులు గుర్తించారు. పొలం పనులకు వెళ్తున్న రైతులు ఇవి చూసి షాక్కు గురయ్యారు. క్షుద్రపూజల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని సమీప గ్రామాలప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, దీని బాధ్యులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు గ్రామస్తులు. ఇదొక్కటే కాదు.. ములుగు జిల్లాలో గతంలోనూ పలు చోట్ల క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల వెతుకులాటలో భాగంగా కూడా కొంతమంది ఇలా క్షుద్రపూజలు చేస్తారని తెలుస్తోంది.
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

