Mulugu: పొలానికి వెళ్తుండగా కనిపించిన ఏదో ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా.!
ఆ గ్రామంలోని రైతులు ఎప్పటిలానే రోజూ తెల్లారేసరికి తమ గడ్డిపార, పనిముట్టు సామాన్లు పట్టుకుని పొలానికి బయల్దేరారు. వారంతా కూడా వారి ఇళ్ళ దగ్గర నుంచి కొంతదూరం వెళ్లేసరికి రోడ్డువైపు ఒక పక్కన ఏదో ఆకారంలా కనిపించింది. దూరంగా ఉన్నారు కాబట్టి అది ఏంటో వారికీ అర్ధం కాలేదు. కొంచెం దగ్గరకు వెళ్లారు. ఏంటని చూడగా దెబ్బకు షాకయ్యారు.
ములుగు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. స్థానిక వెంకటాపురం మదలం బెస్తగూడెం గ్రామ శివారులో రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. ఘటనాస్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు క్షుద్రపూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లను గ్రామస్తులు గుర్తించారు. పొలం పనులకు వెళ్తున్న రైతులు ఇవి చూసి షాక్కు గురయ్యారు. క్షుద్రపూజల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని సమీప గ్రామాలప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, దీని బాధ్యులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు గ్రామస్తులు. ఇదొక్కటే కాదు.. ములుగు జిల్లాలో గతంలోనూ పలు చోట్ల క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల వెతుకులాటలో భాగంగా కూడా కొంతమంది ఇలా క్షుద్రపూజలు చేస్తారని తెలుస్తోంది.
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

