అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది. ఉదయం 6 గంటల 10 నిమిషాలకు సూర్య కిరణాలు ఆలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టు పాదాలను కిరణాలు స్పృశించాయి. సూర్యుని లేలేత కిరణాలు సుమారు కొన్ని సెకెన్లు పాటు మూల విరాట్టు పై ప్రకాశించాయి.
కిరణ స్పర్శ సమయంలో సాల గ్రామ ఏక శిలా విగ్రహమైన ఆదిత్యుని మూలవిరాట్టు బంగారు ఛాయలో కనువిందు చేసింది. ఈ అపురూప దృశ్యo చూసిన భక్తులు పరవశించి పోయారు. నిజంగా ఇదో అద్భుతం. ఐదు ద్వారా బంధాలు, అలివేటి మండపం, ధ్వజస్తంభం, దాటుకొని ఆలయ ఆర్చ్ నుంచి సుమారు 300 అడుగులకు పై బడి దూరం ఉండే గర్భ గుడిలోని మూల విరాట్ ను సూర్య కిరణాలు తాకడాన్ని స్వామి వారి లీలగానే భక్తులు భావిస్తారు. ఈ ఘట్టం చూసేందుకు ముందుగానే ఆలయానికి భారీగా భక్తజనులు తరలి వచ్చారు. వాతావరణం అనుకూలంగా ఉంటే రేపు కూడా సూర్య కిరణాలు అరసవల్లిలో స్వామివారి మూల విరాట్టును తాకనున్నాయి. ప్రతియేటా ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో రెండేసి రోజులు మూలవిరాట్ ను సూర్యకిరణాలు తాకటం ఆనవాయితీ. అరసవల్లి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి గర్భగుడిలోని స్వామి వారి మూలవిరాట్ ను ప్రతియేటా సూర్యకిరణాలు రెండు రోజులు.. రెండు సార్లు స్పృశిస్తాయి. ఉత్తరాయణంలో వచ్చే మార్చ్ 9,10 తేదీలలో , దక్షిణాయనంలో అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూల మూల విరాట్ని సూర్య కిరణాలు తాకటo ఆనవాయితీగా వస్తుంది. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో భారీగా తరలి వస్తూ ఉంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్టోబర్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే
పైరసీపై ఉక్కుపాదం.. స్ట్రాంగ్ వార్నింగ్..!
బీసీసీఐ ముందు తలవంచిన పీసీబీ చీఫ్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

