తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగుల వాన

Updated on: Apr 10, 2026 | 6:16 PM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం తీవ్రంగా మారింది. తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు. ఏపీలో ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాల్పులు. ప్రజలు పిడుగులు, అధిక వేడి నుండి రక్షణకు చెట్ల కింద ఉండరాదని, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో 41°C నమోదు. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భీభత్సంగా మారుతోంది. తెలంగాణలో ఎండలు మండిపోతుండగా, ఏపీలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడులోని మన్నార్ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం అస్థిరంగా మారింది. సముద్రం నుంచి వస్తున్న తేమ గాలులు, భూమిపై ఉన్న వేడి కలిపి పిడుగులు పడటానికి కారణమవుతున్నాయి. ద్రోణి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరోవైపు, విశాఖ, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక మిగతా జిల్లాల పరిస్థితి చూస్తే.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడతాయని అంచనా. అయితే ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వర్షం వచ్చే సమయంలో రైతులు, పశు కాపరులు పొలాల్లో ఉన్నప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద నిలబడకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు విద్యుత్ స్తంభాలకు, వైర్లకు దూరంగా ఉండాలి. పశువులను సురక్షితమైన పాకలలో ఉంచాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టం స్థాయిలి చేరాయి. మహబూబ్‌నగర్‌లో గరిష్టంగా 41°C నమోదైంది. రాబోయే మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో కూడా 38°C పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా ఉంది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ సెగలు పుట్టిస్తుంటే, అదే సమయంలో ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల వివిధ ప్రాంతాల మధ్య వాతావరణ పీడనంలో తేడాలు వస్తున్నాయి. దీని ప్రభావంతో ఉపరితల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయానికి క్యూములో నింబస్ మేఘాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీని వల్ల సాయంత్రం వేళ ఈదురుగాలులు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆంటీ అని పిలిచినందుకు.. మేల్‌ నర్స్‌కు జరిమానా

నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో వైరల్‌

ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు

Gold Price Today: ఆకాశాన్నంటుతున్న బంగారం,వెండి ధరలు

10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

Follow Us