Venkateswara Swamy: ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామికి ముగిసిన పుష్కరోత్సవాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలోని ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో తృతీయ పుష్కరోత్సవాలు వైభవంగా ముగిసాయి. మార్చి 17న ప్రారంభమైన పుష్కరోత్సవాలు మార్చి 24 ఆదివారం వరకు కన్నులపండువగా జరిగాయి. చివరరోజు వేడుకలకు త్రిదండి చినజీయర్స్వామి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. చినజీయర్స్వామి సారథ్యంలో ఆలయాలకు మహా పూర్ణాహుతి, మహా కుంభప్రోక్షణ నిర్వహించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలోని ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో తృతీయ పుష్కరోత్సవాలు వైభవంగా ముగిసాయి. మార్చి 17న ప్రారంభమైన పుష్కరోత్సవాలు మార్చి 24 ఆదివారం వరకు కన్నులపండువగా జరిగాయి. చివరరోజు వేడుకలకు త్రిదండి చినజీయర్స్వామి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. చినజీయర్స్వామి సారథ్యంలో ఆలయాలకు మహా పూర్ణాహుతి, మహా కుంభప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అపోలో గ్రూప్ ఎండీ సంగీతారెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు, ప్రతాప్రెడ్డి కుటుంబ సభ్యులు, అపోలో ఆస్పత్రి ప్రముఖ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పుష్కరోత్సవాలకు వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు చినజీయర్స్వామి మంగళాశాసనాలు అందించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలోని ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు చినజీయర్స్వామి. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి.. ఈ ఆలయానికి ఉందన్నారు. ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ప్రజలకు మరిన్ని సేవలందిస్తామన్నారు అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్రెడ్డి, అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి. ప్రపంచ స్థాయి వైద్యం ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.