రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్ !!

|

Oct 23, 2024 | 1:42 PM

సాధారణంగా పెసర్లతో పెసరట్లు, వడలు ఇలా రకరకాల వంటకాలు చేసుకుని తింటారు. వీటిలో ఫేమస్‌.. ఉప్మా పెసరట్టు. అల్లం, పచ్చి మిర్చి వేసి, కొద్దిగా ఉప్మా పెట్టి.. నెయ్యి వేసి చక్కగా రోస్ట్‌ చేసుకొని తింటే.. అదిరిపోతుంది. అదంతా దాని రుచి మహిమ. దీనికి సాటి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడెవరూ దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కరోనా పుణ్యమా అని చాలా ఆహారాలకు స్వస్తి చెప్పేశారు.

అందరూ మొలకలు తినడం మొదలు పెట్టారు. అయితే ఈ మొలకలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే లభిస్తాయి. నానబెట్టాక మొలకలు వచ్చాక కొందరు తింటే.. ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో కొందరు తింటారు. ఎలా తిన్నా ఇవి టేస్టీగానే ఉంటాయి. గ్యాస్ అని చాలా మంది వీటిని పక్కన పెట్టేశారు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ ఉడకబెట్టినవి ఓ గుప్పెడు తిన్నా చాలా మంచిది. పెసర్లలో విటమిన్లు బి2, బి3, బి5, బి6, బి1, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ఫొటాషియం, ఫోలేట్, జింక్, ఫైబర్, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. పెసలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకుంటారు. అలసట, నీరసం దరి చేరకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aadhar Card: మీ ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి ??

TOP 9 ET News: గంగవ్వకు గుండెపోటు వచ్చిందా ?? క్లారిటీ

 

 

Follow us on