తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి.. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అతలాకుతలమయ్యాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటచేసింది.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్,యానాంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురుస్తుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోనూ గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుసిసాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.