Telangana: పైకి చూసి మిర్చి పంట ఏపుగా పెరిగిందనుకునేరు.. లోపలికి వెళ్లి చూడగా
పంట ఏపుగా పెరిగిందని అనుకుంటే పొరబడినట్టే.. ఆ పంట లోపల యవ్వారం కానిస్తున్నారు కొందరు. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పోచంపల్లి చిన్న గొదుమలై గ్రామంలో పంట చేనులో 16 గంజాయి మొక్కలను సాగు చేస్తూ ఇద్దరు రైతులు పోలీసులకు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నారు. 16 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇద్దరు రైతులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు పోలీస్ అధికారులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి మొక్కలు పెంచినా.. విక్రయించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ASP అన్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

