Andhra: సరదాగా బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చారు.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి
అలా బయటకు వెళ్లి.. ఇంటికి వచ్చేలోపు జరగాల్సింది జరిగిపోయింది. ఇంటి తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.? ఆ ఘటన ఏంటి.? ఈ స్టోరీలో చూసేద్దాం మరి.. ఓ సారి లుక్కేయండి.
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ వెంకటయ్య నగర్లో పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేనిది గమనించి తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగలించారు దుండగులు. సుమారు 12 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు బాధితులు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరులోనూ దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. వరుసగా రెండు దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. హుండీలను పగలుగొట్టి రూ. 35 వేల నగదును ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ పని చేసింది ఊరు దొంగలా, బయట దొంగలా అనే కోణంలో విచారణ చేపట్టారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

