Nandyala: గుబురు మొక్కల మాటున ఏవో చప్పుళ్లు.. అనుమానమొచ్చి కదిలించి చూడగా

Updated on: Aug 20, 2025 | 1:00 PM

ఉదయాన్నే లేచి గ్రామస్తులు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఈలోగా పక్కనే ఉన్న మొక్కల దగ్గర నుంచి అదేపనిగా చప్పుళ్లు రావడం మొదలయ్యాయి. మెల్లిగా నడుస్తూ.. భయం భయంగానే అటు వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

సరీసృపాలలో భారీ ఆకారం, పరిణామంలో పైథాన్‌లు ముందు వరుసలో ఉంటాయి. జంతువులను మాత్రమే కాదు.. మనిషిని కూడా అమాంతం మింగేయగలిగే ఈ పైథాన్‌ను దూరం నుంచి చూస్తేనే మనం అటువైపు వెళ్లడానికి కూడా భయపడతాం. మరి అలాంటిది మన చుట్టుప్రక్కల అదే ఉంటే.. ఇంకేముంది గుండె ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం.. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. స్థానికంగా నివాసముంటున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటి వద్దన కొండచిలువను గుర్తించారు స్థానికులు. వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు. అతికష్టంపై పది అడుగుల కొండచిలువను పట్టుకుని చివరికి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి