ఈ ఏడాది కరోనాకు వ్యాక్సిన్ రాకపోవచ్చు: సీసీఎంబీ
ఈ ఏడాది చివరి లోపు కరోనాకు వ్యాక్సిన్ రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్లో వేగాన్ని పెంచాయి.
ఈ ఏడాది చివరి లోపు కరోనాకు వ్యాక్సిన్ రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్ ట్రయల్స్లో వేగాన్ని పెంచాయి. ఇలాంటి క్రమంలో ఈ ఏడాది కోవిడ్ 19కు వ్యాక్సిన్ రావడం కష్టమేనని సీఎస్ఐఆర్-సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా అంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది అందుబాటులోకి రావొచ్చని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ కోసం భారీ స్థాయిలో ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
నిజానికి చెప్పాలంటే వ్యాక్సిన్ల అభివృద్ధికి చాలా ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేస్తే వచ్చే ఏడాది తొలినాళ్లలో ఇది రావొచ్చు. అంతకన్నా ముందు మందు రావడం కష్టమే. వ్యాక్సిన్ కోసం భారీ సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారికి టీకా ఇచ్చి తగ్గిందా లేదా అని చూసేందుకు ఇదేమీ డ్రగ్ కాదు అని మిశ్రా తెలిపారు. ప్రస్తుతం రోజుకు 400-500 కరోనా టెస్టులు చేస్తున్నామని.. తక్కువ ధరలో, ఎక్కువ టెస్టులు చేసే విధానానికి సంబంధించిన ప్రతిపాదనను తాము ఐసీఎంఆర్కు పంపామని ఆయన వివరించారు. అనుమతి కోసమే ఎదురుచూస్తున్నామని మిశ్రా వెల్లడించారు.