కశ్మీరీ వ్యాపారులపై దాడికి దిగిన హిందూ దళ్
ఉత్తరప్రదేశ్ : కశ్మీరీ వ్యాపారులపై ఉత్తర భారతంలో అక్కడక్కడ ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల పుల్వామా దాడి తర్వాత అనేక ప్రాంతాల్లో కశ్మీరీలపై దాడుల ఘటనలు పెరిగాయి. తాజాగా లక్నోలో రోడ్డుపై వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులపై ఇద్దరు స్థానిక హిందూ దళ్ నేతలు దాడులకు దిగారు. డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే ఆ వ్యాపారులను చితకబాదారు. బుధవారం సాయంత్ర దలీగంజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాషాయం దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాపారులపై విరుచుకుపడ్డారు. […]
ఉత్తరప్రదేశ్ : కశ్మీరీ వ్యాపారులపై ఉత్తర భారతంలో అక్కడక్కడ ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల పుల్వామా దాడి తర్వాత అనేక ప్రాంతాల్లో కశ్మీరీలపై దాడుల ఘటనలు పెరిగాయి. తాజాగా లక్నోలో రోడ్డుపై వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులపై ఇద్దరు స్థానిక హిందూ దళ్ నేతలు దాడులకు దిగారు. డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే ఆ వ్యాపారులను చితకబాదారు. బుధవారం సాయంత్ర దలీగంజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాషాయం దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాపారులపై విరుచుకుపడ్డారు. అయితే అక్కడున్న కొందరు అడ్డుకోవడంతో.. గోడవ సద్దుమణిగింది. గత కొన్నేళ్లుగా లక్నోలో కశ్మీరీలు డ్రైఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
SHOCKING: Some goons in saffron kurtas throttle, assault a Kashmiri dry fruit seller in Lucknow. Passersby come to rescue of the Kashmiri. Case yet to be registered.
Hope @Uppolice @Igrangelucknow @lkopolice register an FIR and jab these goondas at the earliest. pic.twitter.com/zXjI3Anh2n
— Prashant Kumar (@scribe_prashant) March 6, 2019