
సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పించే వేదిక. ప్రతిరోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా సార్లు, కొన్ని వీడియోలు చూసిన తర్వాత ప్రజలకు చాలా కోపం తెప్పిస్తాయి. అదే సమయంలో కొన్ని వీడియోలు వారి ప్రతిభను ప్రదర్శించేవిగా ఉంటాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఇటీవల, ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచు కురుస్తున్న ఐస్ స్కేటింగ్ కోసం, మందపాటి బట్టలు ధరించి అన్ని భద్రతా చర్యలు పాటించిన తర్వాత కూడా చాలా సార్లు స్కేటింగ్ చేస్తున్నప్పుడు జారిపడిపోతుంటారు. కానీ, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ మందపాటి ఎరుపు రంగు లెహంగాలో ఎంతో హాయిగా స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అంతేకాదు.. అలాంటి డ్రెస్లో స్కెటింగ్ చేస్తూ ఆమె కెమెరాకు పోజులు కూడా ఇస్తోంది.
@bombaymami అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ రీల్ను పోస్ట్ చేశారు. ఈ వైరల్ రీల్ ఇప్పటివరకు 24 లక్షలకు పైగా వ్యూస్, 1 లక్ష 40 వేలకు పైగా లైక్లను సాధించింది. కాగా, పోస్ట్పై 2 వేలకు పైగా వ్యాఖ్యలు వచ్చాయి. ఈ పోస్ట్ను దియా మీర్జాతో సహా అనేక ఇతర ప్రముఖులు, ప్రభావశీలులు కూడా లైక్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…