
బీహార్లోని జముయ్లో ఒక మహిళ తన భర్త ముందే తన మేనల్లుడిని వివాహం చేసుకుంది. ఈ వివాహ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన భర్త, కూతురు ముందే వివాహం చేసుకున్నట్లు ఆ వీడియో చూపిస్తుంది. జముయ్ జిల్లాలోని సిఖేరియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అప్పటికే పెళ్లయి ఒక కూతరు కూడా ఉన్న ఆయుషి కుమారి అనే మహిళ ప్రియుడి కోసం భర్తను, కూతురును వదిలేసింది. స్థానకంగా ఉండే ఓ ఆలయంలో జూన్ 20న పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆయుషి 2021లో అదే గ్రామంలో విశాల్ దూబేను వివాహం చేసుకుంది. వారికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే, ఆయుషి అదే గ్రామానికి చెందిన వరుసకు మేనళ్లుడయిన సచిన్ దూబేతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారు మొదట సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అది తరువాత వివాహేతర సంబంధంగా మారింది. వారు ఫోన్లో కలుసుకోవడం, మాట్లాడుకోవడం కొనసాగించారు, అయితే, కుటుంబంలో ఎవరికీ ఏమీ అనుమానం రాలేదు.
జూన్ 15న ఆయుషి సచిన్ తో పారిపోయినప్పుడు వారి సంబంధం బయటపడింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త సదర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, ఆయుషి త్వరలోనే జముయ్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన కుమార్తెను కూడా నిరాకరించింది. చివరకు శుక్రవారం సాయంత్రం, ఆయుషి రెండు కుటుంబాల అంగీకారంతో ఒక గ్రామ ఆలయంలో సచిన్ను వివాహం చేసుకుంది.
సచిన్ మాట్లాడుతూ, “మేము రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. ఇప్పుడు మా సంబంధానికి ఒక పేరు ఉంది. నేను ఆయుషిని ఎప్పటికీ సంతోషంగా ఉంచుతాను.” అని చెప్పాడు. ఇక ఆయుషి భర్త విశాల్ మాట్లాడుతూ “ఇది ఆమెను సంతోషపెట్టేదైతే, నేను ఆమెను ఆపను. కానీ ఆమె నాపై చేసిన ఆరోపణలు అబద్ధం. నిజానికి, ఆమె నా తల్లి మరియు కుమార్తెతో దురుసుగా ప్రవర్తించేది. ఇప్పటి నుండి, ఆమె బాధ్యత సచిన్దే.” అని చెప్పుకొచ్చాడు.
चाची ने की भतीजे से लव मैरिज, चुपचाप सामने खड़ा रहा पति।
बिहार के जमुई में एक महिला पर प्यार का ऐसा जुनून चढ़ा कि उसने भतीजे को ही पति बना लिया. महिला ने रिश्ते के भतीजे के साथ मंदिर में शादी रचाई जहां उसका पति भी मौजूद था. pic.twitter.com/bxZNyTQVby
— प्रभाकर पाण्डेय (@I_PP17) June 21, 2025