
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి ఆసుపత్రి బెడ్పై పడుకుని ఉన్నాడు. అతనికి సెలైన్ బాటిల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ అమర్చి ఉన్నాయి. అతను అనారోగ్యంతో నీరసంగా కనిపిస్తున్నాడు. కానీ, అతనికి సపర్యలు చేయాల్సిన భార్య, పక్కనే నిలబడి మొబైల్ కెమెరా ఆన్ చేసి ఒక ట్రెండింగ్ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఆసుపత్రి వార్డులోనే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, డ్యాన్స్ మూవ్స్ వేస్తూ ఆమె ఆ వీడియోను రికార్డ్ చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన కొద్దిసేపటికే వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ రోజుల్లో జనాలకు బంధాల కంటే వ్యూస్, లైకులే ముఖ్యం అయిపోయాయి. భర్త ఆసుపత్రిలో ఉంటే బాధపడాల్సింది పోయి, ఇలా డ్యాన్సులు చేయడం ఏంటి? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా పిచ్చి మనుషుల్లోని కనీస మానవత్వాన్ని, ఇతరుల పట్ల సానుభూతిని చంపేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొందరు అంత్యక్రియల సమయంలో, ప్రమాదాలు జరిగిన స్థలాల్లో రీల్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఆసుపత్రి అనేది రోగులు ప్రశాంతంగా చికిత్స పొందే స్థలమని, అక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలే తప్ప ఇలాంటి వికృత చేష్టలు చేయకూడదని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, లైకుల కోసం ప్రాణసమానుడైన భర్త అనారోగ్యాన్ని కూడా కంటెంట్ క్రియేషన్కు వాడుకున్న ఈ భార్య వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.