
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కెంటకీలోని లూయిస్విల్లే ఎయిర్పోర్టులో UPS కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో పలు భవనాలు దగ్దమయ్యాయి. ఆ విమానంలోని ముగ్గురు సిబ్బంది మృతి చెందగా.. మరో 11 మందికి గాయాలయ్యాయి. ఇక స్పాట్లో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. ఆ కార్గో విమానం 42వేల గ్యాలన్లు జెట్ ఇంధనాన్ని మోసుకెళ్తోన్న తెలుస్తోంది. అటు ఈ విమానంలో పెద్ద ఎత్తున ఇంధనం ఉండటం.. అలాగే బిల్డింగ్లపై కూలడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంటున్నారు.