రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు..ఈ ఆలయ రహస్యం ఓ అద్బుతం..! ఒక్కసారి దర్శిస్తే..

భారతదేశంలో హనుమంతుడి ఆలయాలకు కొదువ లేదు.. కానీ, ఈ గుడి మాత్రం అద్భుతమైనది.. ఎందుకంటే.. ఇక్కడ కొలువైన హనుమంతుడు 15 వందల ఏళ్లుగా పైకప్పు లేకుండానే ఉన్నాడు. రోజురోజుకీ పెరుగుతుండటం ఈ ఆంజనేయుడి ప్రత్యేకత. అయితే ఈ ఆంజనేయుడికి ఎదురుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సైతం పైకప్పు ఉండకపోవడం విశేషం.

రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు..ఈ ఆలయ రహస్యం ఓ అద్బుతం..! ఒక్కసారి దర్శిస్తే..
Namakkal Hanuman Temple

Updated on: Feb 09, 2026 | 6:06 AM

మన దేశంలో హనుమాన్ ఆలయాలకు కొరత లేదు. కానీ, తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని నమక్కల్ హనుమాన్ ఆలయం మాత్రం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఇక్కడి హనుమాన్ విగ్రహం రోజురోజుకూ పరిమాణంలో పెరుగుతుండటమేనని భక్తులు చెబుతున్నారు. అందుకు అనుకూలంగానే ఇక్కడ హనుమంతుడికి పై కప్పు, గోపురం లేకుండానే ఉన్నాడు. దాదాపు 20 అడుగుల పొడవున్న ఈ భారీ ఏకశిలా విగ్రహం బహిరంగ ఆకాశం కింద అంత ఎత్తున నిలబడి ఉంటాడు.

విశేషం ఏంటంటే..ఇక్కడ వెలసిన హనుమంతుడి విగ్రహానికి పైకప్పు నిర్మించడానికి గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని స్థానికులు చెబుతారు. విగ్రహం నిరంతరం పెరుగుతూ ఉండటం వల్ల దానిపై పైకప్పు వేయడం సాధ్యం కాదని ఇక్కడి పూజారులు, భక్తులు గట్టిగా నమ్ముతారు. హనుమంతుడికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కూడా పైకప్పు లేకపోవడం మరో ఆశ్చర్యం.

నరసింహుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉన్న ఆంజనేయుడు

ఇవి కూడా చదవండి

దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నామక్కల్ కొండల దిగువన ఉంది. ఇక్కడ, ఆంజనేయుడు చేతులు ముడుచుకున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడి మరణం తర్వాత ఈ ప్రదేశంలో నరసింహుడు కనిపించినప్పుడు, ఆంజనేయుడు తన దర్శనం కోసం ఇక్కడకు వచ్చాడని చెబుతారు. అందుకే హనుమంతుడు నరసింహుడిని దర్శనం చేసుకోవడానికి వీలుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి లభించడమే కాకుండా వ్యక్తిగత జీవితంలోని అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. చెడు అలవాట్లు లేదా మానసిక బలహీనతతో బాధపడేవారు ఇక్కడ ప్రార్థిస్తే అవి త్వరలోనే తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

16వ శతాబ్దంలో రామచంద్ర నాయక్ నిర్మించిన నామగిరి కోట, ఆలయానికి సమీపంలో ఉన్న పర్యాటక ఆకర్షణ. ఇక్కడి రాతి శిల్పాలు, కొండపై ఉన్న ఎనిమిది చెరువులు అందరినీ ఆకర్షిస్తాయి. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి సమయంలో ఇక్కడ పండుగ ఘనంగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా తమిళనాడును సందర్శిస్తే, సేలం మార్గంలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించడం మర్చిపోవద్దు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..