Viral Video: బక్రీద్ వేడుకల్లో వినూత్న మార్పు..జంతు బలికి బదులు మేక కేక్ కట్ చేసిన ముస్లిం కుటుంబం!

బక్రీద్ అనగానే ముస్లిం సోదరులు జరిపే సాంప్రదాయ జంతు బలి (కుర్బానీ) గుర్తుకు వస్తుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక ముస్లిం కుటుంబం ఈ పండుగను సరికొత్తగా జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. జంతువులను బలి ఇవ్వడానికి బదులుగా, వారు మేక చిత్రం (Goat Image) ఉన్న ఒక కేక్‌ను కట్ చేసి పండుగ వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే:

Viral Video: బక్రీద్ వేడుకల్లో వినూత్న మార్పు..జంతు బలికి బదులు మేక కేక్ కట్ చేసిన ముస్లిం కుటుంబం!
Bakrid Goat Cake Viral Video

Updated on: May 29, 2026 | 3:09 PM

బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక ముస్లిం కుటుంబం తీసుకున్న వినూత్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ లాయర్ గుల్ చమన్ షేర్వాణి నివాసంలో ఈ వినూత్న వేడుక జరిగింది. బక్రీద్ రోజున జీవహింసను అరికట్టాలనే బలమైన సందేశాన్ని సమాజానికి ఇవ్వాలని ఈ కుటుంబం నిర్ణయించుకుంది. అందుకోసం వారు ఒక ప్రత్యేకమైన కేక్‌ను ఆర్డర్ చేసి, కుటుంబ సభ్యులందరి సమక్షంలో దానిని కట్ చేశారు.

ఈ సందర్భంగా గుల్ చమన్ షేర్వాణి మాట్లాడుతూ, ల్లాహ్ ఎప్పుడూ మనుషుల హృదయాలలోని నిజాయితీని, మంచి ఉద్దేశాలను మాత్రమే చూస్తాడు కానీ, ఆడంబరాలను కాదు. నిజమైన త్యాగం (బలి) అనేది మనలో ఉన్న అంతర్గత చెడును, అహంకారాన్ని, ద్వేషాన్ని, లోభత్వాన్ని వదిలిపెట్టడంలోనే ఉంది అని పేర్కొన్నారు. నేటి కాలంలో చాలా మంది బలి పేరుతో తమ సంపదను ప్రదర్శిస్తున్నారని, కానీ నిష్కపటమైన మనసుతో చేసే చిన్న ప్రార్థన కూడా అల్లాహ్‌కు చేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈ కేక్ కటింగ్ వీడియో సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందిస్తున్నారు. జంతువుల పట్ల కరుణ చూపడం, జీవహింసను వ్యతిరేకించడం చాలా మంచి పరిణామమని కొందరు ఈ లాయర్ కుటుంబాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది శతాబ్దాలుగా వస్తున్న మతపరమైన ఆచారాలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఏది ఏమైనప్పటికీ, పండుగ రోజున సమాజంలో విద్వేషాలను పక్కనబెట్టి, మానవత్వం, శాంతి, సోదరభావాన్ని చాటిచెప్పడమే తమ ముఖ్య ఉద్దేశమని షేర్వాణి కుటుంబం స్పష్టం చేసింది. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

 

Follow Us