viral News: వైరల్‌ అవుతోన్న 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌ ఆఫర్‌ లెటర్‌.. అప్పట్లో జీతం ఎంతో తెలుసా.?

|

Oct 01, 2024 | 6:20 PM

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోహిత్‌ కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి కెరీర్‌లో మొదటిసారి టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో తనకు వచ్చి ఆఫర్‌ లెటర్‌ను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. 40 ఏళ్ల క్రితంనాటి ఆఫర్‌ లెటర్‌తో పాటు...

viral News: వైరల్‌ అవుతోన్న 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌ ఆఫర్‌ లెటర్‌.. అప్పట్లో జీతం ఎంతో తెలుసా.?
TCS
Follow us on

రోజులు మారాయి, మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా జీతభత్యాలు కూడా మారిపోయాయి. ప్రస్తుతం నెలకు రూ. లక్షల్లో జీతాలు ఆర్జిస్తున్నారు. మరి ఒక 40 ఏళ్ల క్రితం జీతాలు ఎంత ఉండేవి. అది కూడా ప్రస్తుతం దిగ్గజ ఐటీ సంస్థగా పేరుగాంచిన టీసీఎస్‌ వంటి దిగ్గజ ఐటీ సంస్థలో జీతాలు ఎలా ఉండేవో ఎప్పుడైనా ఆలోచించారా.? తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోహిత్‌ కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి కెరీర్‌లో మొదటిసారి టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో తనకు వచ్చి ఆఫర్‌ లెటర్‌ను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. 40 ఏళ్ల క్రితంనాటి ఆఫర్‌ లెటర్‌తో పాటు.. ’40 ఏళ్ల క్రితం ఐఐటీ బీహెచ్‌యూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సెలెక్ట్‌ అయ్యాను. ముంబయి టీసీఎస్‌ క్యాంపస్‌లో నాకు మొదటి ఉద్యోగం వచ్చింది. నా జీతం రూ.1,300. అప్పట్లో అది చాలా ఎక్కువ. నారీమన్‌ పాయింట్‌లోని ఎయిరిండియా 11వ అంతస్తు నుంచి సముద్రం చూసేందుకు అద్భుతంగా ఉండేది’ అంటూ రాసుకొచ్చారు.

రూ. 1300 అనేది ఇప్పుడు చాలా చిన్న మొత్తంగా కనిపించినా 40 ఏళ్ల క్రితం మాత్రం ఇది చాలా పెద్ద అమౌంట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఇదే టీసీఎస్‌ కంపెనీ ఫ్రెషర్స్‌కి నెలకు రూ. లక్షల్లో జీతాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ కుమార్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా మీ తొలి జీతం ఎంత అని ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రూ. 2,200 అంటూ బదులిచారు. కాగా రోహత్‌ కుమార్‌ ప్రస్తుతం.. ఎన్‌సీడీఆర్‌సీలో సేవలు అందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..