
పాఠశాల అనేది కేవలం చదువు నేర్పే చోటు మాత్రమే కాదు.. అది పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదిక కూడా అని ఈ వైరల్ వీడియో నిరూపించింది. ఒక చిన్నారి లంచ్ బాక్స్ విషయంలో జరిగిన ఈ సంఘటన అందరి హృదయాలను హత్తుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ రకరకాల కూరలు, పప్పులు తెచ్చుకోగా, ఒక పేద విద్యార్థి మాత్రం తన బాక్స్లో కేవలం రొట్టె, పంచదార మాత్రమే తెచ్చుకున్నాడు. తన స్నేహితుల ముందు ఆ ఆహారాన్ని తీయడానికి ఆ బాలుడు సంకోచిస్తూ, తల దించుకుని కూర్చున్నాడు. ఆ చిన్నారి తన బాక్స్ చూసి కొంత ఇబ్బందిగా, తక్కువగా ఫీల్ అవుతున్నట్టుగా కనిపించింది.
ఆ చిన్నారి ముఖంలోని బాధను, ఆత్మన్యూనతను గమనించిన ఉపాధ్యాయురాలు, నిశ్శబ్దంగా తన దగ్గరకు వెళ్లారు. ఆమె ఆ బాలుడిని మందలించడమో లేదా జాలి చూపడమో చేయకుండా, అరె.. రొట్టె-పంచదార తెచ్చుకున్నావా? నాకు ఇది అంటే చాలా ఇష్టం! మనం ఇద్దరం కలిసి తిందామా? అని అడిగారు. ఆమె తన దగ్గర ఉన్న కూరలను ఆ బాలుడికి ఇచ్చి, అతని దగ్గర ఉన్న రొట్టెను ఆమె తిన్నారు. ఆ చిన్నారితో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఆ బాక్స్లో ఉన్నది సాధారణ ఆహారం కాదని, అది చాలా రుచికరమైనదని (Classic combination) పాపతో చెప్పారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు అని ఆమెను ఉత్సాహపరిచారు. టీచర్ మాటలతో ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వు విరిసింది. ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు మాటలతో కాకుండా చేతలతో ఎలా ధైర్యం చెప్పాలో ఆమె నిరూపించారు.
ఈ చిన్న సంఘటన ద్వారా ఆ ఉపాధ్యాయురాలు సమాజానికి రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. ఒకటి ఆహారాన్ని గౌరవించడం. ఇంట్లో ఏది ఉంటే అది తెచ్చుకున్న పాపను ప్రోత్సహించడం ద్వారా ఆహారం విలువను చాటిచెప్పారు. మరొకటి పిల్లల్లో సామాజిక స్పృహను కలిగించటం. ఆర్థిక వ్యత్యాసాల వల్ల పిల్లల మనసు గాయపడకుండా చూడటం ఎంత ముఖ్యమో ఆమె నిరూపించారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వీడియో చూసిన లక్షలాది మంది నెటిజన్లు సదరు ఉపాధ్యాయురాలిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజమైన విద్య అంటే అక్షరాలు నేర్పడం మాత్రమే కాదు, ఇతరుల పట్ల దయగా ఉండటం నేర్పడం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి స్కూల్లోనూ ఇలాంటి టీచర్లు ఉండాలి, చిన్నారి ఆత్మగౌరవాన్ని కాపాడారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక చిన్న ప్రోత్సాహం ఒకరి జీవితంలో ఎంతటి సానుకూల మార్పును తెస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. భౌతికమైన వస్తువుల కంటే మానవత్వం, ప్రేమ గొప్పవని ఈ టీచర్ చాటిచెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..