భారత్ కీ బాత్
మనకు 2023 సంవత్సరం వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలను మన మదిలో నిలిపింది. 2023 సంవత్సరంలో యావత్ ప్రపంచం భారత వైపు చూసింది. అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఈ సంవత్సరం మరింత పెంచింది. భారత్ మైత్రీ సంబంధాలను పెంపొందించుకునేందుకు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు దహతహలాడాయి. జీ20 శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం దేశ ప్రతిష్టను మరింత పెంచింది. ఓ రకంగా అంతర్జాతీయ అంశాల్లో భారత్ మాటకు విలువ పెరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల్లో పర్యటించి భారత వాణిని బలంగా వినిపించారు. ఆ దేశాలతో మైత్రీ సంబంధాలను మునుపెన్నడూ లేనంతగా బలోపేతం చేశారు. 2023లో భారత ప్రతిష్టను మరింత పెంచిన అంశాలు, సంఘటలను ఇప్పుడు ఒకసారి సింహావ లోకనం చేసుకుందాం..
Year Ender-2023: విద్యా రంగంలో కొత్త అధ్యాయం.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
2023 సంవత్సరం భారతదేశ విద్యా రంగంలో కొత్త పరివర్తనాత్మక నిర్ణయాల చిత్రపటాన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది పొడవునా, భారతదేశంలో విదేశీ యూనివర్సిటీ క్యాంపస్లను తెరవడం కోసం డ్రాఫ్ట్ విడుదల చేసింది. క్రెడిట్ ఫ్రేమ్వర్క్, కరికులమ్ రివిజన్లు, తప్పనిసరి ఇంటర్న్షిప్లతో పాటు సెంట్రల్ యూనివర్శిటీల (సవరణ) బిల్లు, 2023తో సహా విద్యా రంగం గణనీయమైన అభివృద్ధిని బాటలు వేసింది.
- Balaraju Goud
- Updated on: Dec 13, 2023
- 3:22 pm
ISRO – 2023: ప్రపంచం మొత్తం చూపు ఇస్రో వైపు.. కలిసి పని చేసేందుకు నాసా లాంటి సంస్థల ఆసక్తి
భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన, కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది.
- Ch Murali
- Updated on: Dec 12, 2023
- 11:21 am