సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? అయితే జాగ్రత్త.. మీరు వెళ్ళే విషయాలను ఎవరికైనా షేర్ చేస్తే అంతే సంగతులు..

సంక్రాంతి పండగ సందడి మొదలైంది. పట్నంలో ఉన్నవారు పల్లె బాట పట్టారు. దాదాపు నగరం సగం వరకు ఖాళీ అయిపోయింది.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? అయితే జాగ్రత్త.. మీరు వెళ్ళే విషయాలను ఎవరికైనా షేర్ చేస్తే అంతే సంగతులు..

Updated on: Jan 13, 2021 | 1:32 PM

సంక్రాంతి పండగ సందడి మొదలైంది. పట్నంలో ఉన్నవారు పల్లె బాట పట్టారు. దాదాపు నగరం సగం వరకు ఖాళీ అయిపోయింది. ఇదే అదునుగా దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్ళే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‏లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో వరుస ఇళ్ళ దొంగతనాలు చేసిన అబ్దుల్ జాఫర్‏ని అదుపులోకి తీసుకున్నాం. అతని దగ్గరి నుంచి 23 తులాల బంగారం, డైమండ్ ఆర్నమెంట్‏తోపాటు అతని బైక్‏ను సీజ్ చేశామని హైదరాబాద్ సీపీ అంజినీ కుమార్ అన్నారు. వీరి దగ్గరి నుంచి సీజ్ చేసిన వాటి విలువ 12 లక్షలు ఉంటుందని తెలిపారు. 2006 నుంచి ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 66 ఇళ్ళ దొంగతనాల కేసులున్నాయని.. సౌత్ జోన్ పరిధిలో హాబీబ్ అజమత్ అనే దొంగను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. అజమత్ పార్ట్నర్ షారుఖ్ పరారీలో ఉన్నాడని.. అజమత్ నుంచి 10 లక్షల 50 వేల విలువైన 20 తులాల బంగారంతోపాటు ఆటోను కూడా సీజ్ చేశామన్నారు. ఇతనిపై ఇప్పటివరకు దాదాపు 30 కేసులున్నాయన్నారు. సంక్రాంతి ఊరు వెళ్ళేవారు స్థానిక పీఎస్‏లో ఇన్‏ఫార్మ్ చేసి వెళ్ళాలని.. అలాగే సీసీ కెమెరాల స్టోరేజ్ డివైజ్ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని వెళ్ళాలని తెలిపారు. ఇక ఊరు వెళ్ళే విషయాలను సోషల్ మీడియాలో ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని తెలిపారు.

Also Read: ‘వ్యక్తిగతంగా నా జీవితంలో ఓ సంఘటన జరిగింది’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన స్టైలిష్ స్టార్..

సురేఖ ఒప్పుకోదేమో అనుకున్నా.. ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చాలా బాధపడ్డా.. ఎమోషనల్ అయిన మెగాస్టార్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us