Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక బులిటెన్ విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగనుందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి తాజా విశ్లేషణ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలలో రాబోయే మార్పుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:

Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ హెచ్చరిక!
Imd Warning Telangana

Updated on: Mar 22, 2026 | 6:30 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక బులిటెన్ విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగనుందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి తాజా విశ్లేషణ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలలో రాబోయే మార్పుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తమిళనాడు, కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి, పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదై, వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. అయితే, ఇది తాత్కాలికమే. ఆ తర్వాతి నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. సగటున 2 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఎండల తీవ్రత మళ్ళీ మొదలవ్వనుంది.

ఇవి కూడా చదవండి

ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బయట తిరగవద్దని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలను కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

అటు, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా కీలక ప్రకటన చేసింది. ఏపీ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం (23-03-26)శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

అలాగే బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది.ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us