Telangana RTC: టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ బస్సులన్నింటిలోనూ..

|

Jul 20, 2022 | 10:36 AM

Telangana RTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Telangana RTC: టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ బస్సులన్నింటిలోనూ..
Tsrtc
Follow us on

Telangana RTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుస నిర్ణయాలతో సంస్థను లాభాల బాటలో పయనించేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే

తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు టీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఎసీ బస్సు సర్వీసుల్లో ప్రయాణికులకు మంచినీటి బాటిళ్లు, ఫేస్ ఫ్రెషనర్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సేవలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసింది.

కాగా, గతంలో దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో మాత్రమే మంచినీటి బాటిళ్లను అందించేవారు. కరోనా కారణంగా ఆ సర్వీస్‌ను నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసును పునరుద్ధరించారు. దూరం, మార్గంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఏసీ బస్సుల్లో ఈ సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించనున్నారు. ప్రయాణికులతో పాటు.. ఏసీ బస్సుల్లోని డ్రైవర్లు, అటెండర్లకు కూడా వాటర్ బాటిల్స్ సప్ల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..