Telangana Corona: తెలంగాణలో కరోనా కరాళ నృత్యం.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా 10,122 మంది పాజిటివ్, 52 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ అంతకంతకు వికృతరూపం ప్రదర్శిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10వేలను క్రాస్‌ చేసింది.

Telangana Corona: తెలంగాణలో కరోనా కరాళ నృత్యం.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా 10,122 మంది పాజిటివ్, 52 మంది మృతి

Updated on: Apr 27, 2021 | 9:58 AM

Telangana corona virus cases: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ అంతకంతకు వికృతరూపం ప్రదర్శిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10వేలను క్రాస్‌ చేసింది. గడిచిన 24గంటల్లో ముందెన్నడు లేనంతగా, రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల సోమవారం రాత్రి 8గంటల వరకు కరోనా నిర్ధారన పరీక్షలు నిర్వహించగా 10,122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. నిన్న ఒక్కరోజే 52 మంది మృతి ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బలెటిన్‌లో పేర్కొంది.

ఇక, ఇవాళ నమోదైన కేసులతో కలుపుని ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, సోమవారం 6,446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా బారినపడి 2,094 మంది ప్రాణాలొదిలారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69,221 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నిన్న 99,638 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇదిలావుంటే, కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,440మంది కరోనా బారిన పడ్డారు. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 751, రంగారెడ్డిలో 621, వరంగల్‌ అర్బన్‌లో 653, నిజామాబాద్‌లో 498, నల్లగొండలో 469, ఖమ్మంలో 424, మహబూబ్‌నగర్‌లో 417, కరీంనగర్‌ జిల్లాలో 369 చొప్పున నమోదయ్యాయి.

Ts Corona

Read Also…  COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించండి.. సీరం, భారత్ బయోటెక్‌లను కోరిన కేంద్ర ప్రభుత్వం..

Loading...
Unable to load recommendations.
Follow Us