Nalgonda SP: దటీజ్ డీఐజీ రంగనాథ్.. మరోసారి సామాన్యుడికి అండగా నిలిచిన ఐపీఎస్..
Nalgonda SP: ఫ్రెండ్లీ పోలీసింగ్తో నిత్యం సామాన్యులకు అండగా నిలుస్తారని పేరున్న నల్గొండ డిఐజి ఏబీ రంగనాథ్.. మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.
Nalgonda SP: ఫ్రెండ్లీ పోలీసింగ్తో నిత్యం సామాన్యులకు అండగా నిలుస్తారని పేరున్న నల్గొండ డీఐజీ ఏబీ రంగనాథ్.. మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకూ విషయమేంటంటే.. ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యనారాయణ హైద్రాబాద్లోని మియపూర్లో నివాసముంటున్నారు. అయితే, హైదరాబాద్లో తనకున్న అస్తి అమ్మగా వచ్చిన సొమ్మును ఖమ్మంలో వసూలు చేసుకుని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తిరుగు పయనం అయ్యాడు. ఇంతలో నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు బస్సును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సత్యనారాయణ వద్ద ఉన్న డబ్బును గుర్తించారు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపాలని కోరుతూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు.
సత్యనారాయణ తన వద్దనున్న నగదుకు సంబంధించిన అన్ని ఆధారాలు చూపినా పోలీస్ స్టేషన్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు సత్యనారాయణ.. విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా డిఐజి రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందేశానికి తక్షణమే స్పందించిన డీఐజీ రంగనాధ్.. స్వయంగా బాధితుడికి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. అంతేకాదు.. నిమిషాల వ్యవధిలోనే సొమ్మును భద్రంగా ముట్టచెప్పాలని చిట్యాల ఎస్ఐ ను ఆదేశించారు. ఊహించని ఈ రెస్పాండ్స్తో సత్యన్నారాయణ సంతోషం వ్యక్తం చేశాడు. జరిగిన విషయాన్ని సన్నిహితులతో షేర్ చేసుకోవడమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ డీఐజీ రంగనాథ్ను ప్రశంసలతో ముంచెత్తాడు. దాంతో ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది. నిత్యం సామాన్యుల పక్షపాతిగా వ్యవహరించే అధికారిగా పేరున్న ఐపీఎస్ రంగనాథ్.. మరోసారి తన పోలీసింగ్తో అందరినీ ఆకట్టుకోవడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also read:
డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి
Hyderabad Crime: మళ్లీ అదే జరిగితే తలాక్ చెబుతానన్న భర్త.. తీవ్ర మనస్తాపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
Love Story: ‘లవ్ స్టోరీ’ సినిమాకు జై కొడుతున్న జనం.. రెండోవారం కూడా తగ్గని జోరు..