Nagarjuna Sagar By Election Results 2021: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రతి రౌండులోనూ కారు జోరుగా సాగిపోతోంది. ఇక్కడ గెలుపు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ వెనుకబడిపోయింది. కడపటి వార్తలు అందేసరికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 18వ రౌండ్లు ముగిశాయి. అప్పటికి TRS పార్టీ అభ్యర్థి నోముల భగత్ 13,396 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినదగ్గర నుంచీ.. టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రతి రౌండ్ లోనూ ఆ పార్టీ అభ్యర్థి లీడ్ సాధిస్తూ వస్తున్నారు. ముక్కోణపు పోటీలా కనిపించిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా మూడో స్థానంలో ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డి కి, టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు మధ్యనే ప్రధాన పోరు నిలిచింది. ఇక రౌండ్ రౌండ్ కూ టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది.
ఇక ఇప్పటివరకూ ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన ఫలితాలు రౌండ్ల వారీగా ఇలా ఉన్నాయి..
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలైంది. నల్గొండలోని గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ జరుగుతోంది. తొలుత గుర్రంపోడు మండల ఓట్ల లెక్కింపుతో ప్రారంభం అయిన కౌంటింగ్.. త్రిపురారం మండల ఓట్ల లెక్కింపుతో ముగుస్తుంది. రెండు హాళ్లలో 14 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. గత నెల 17న సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది.
Tirupati By Election Results 2021 LIVE: తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. కొనసాగుతోన్న వైసీపీ హావా.!