Telangana: ఇదిగో.. ఈ నీళ్లతో కండ్లు కడుక్కోండి.. ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే ఊహించని కౌంటర్..!
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలం ఎలా వుందో చూపిస్తా చూడండని ఓ MLA హల్ చల్ చేశాడు.. వ్యవసాయ బావిలో చేతికి అందుతున్న నీళ్లను చెంబుతో సేకరించి
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలం ఎలా వుందో చూపిస్తా చూడండని ఓ MLA హల్ చల్ చేశాడు.. వ్యవసాయ బావిలో చేతికి అందుతున్న నీళ్లను చెంబుతో సేకరించి ప్రతిపక్షాలకు చురకలు అంటించాడు.. చూపరులను ఆశ్చర్యపర్చాడు.. ఒకప్పుడు నీళ్ళులేక ఎండి పోయిన బోరుబావులు ఇలా నిండుకుండలా మారి నీళ్లు ఉబికిరావడం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలం కాదా అని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రశ్నించారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న MLA శంకర్ నాయక్ అక్కడ సక్రమంగా పనిచేయని అధికారులకు మొట్టికాయలు వేశారు.. మీ సేవలు ఇకచాలు మిమ్మల్ని దుబాయ్ పాంపాల్సిందే అని హెచ్చరించారు.. అనంతరం ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తూ హల్ చల్ చేశారు.. దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యలో నిండు కుండాలా కనిపిస్తున్న వ్యవసాయ భావిని చూసి ఇలా హల్ చల్ చేశారు..
నిండుకుండలా కనిపిస్తున్న బావిలో నీరు చేతికి అందుతుండడంతో ఎలాంటి బొక్కెన అవసరం లేకుండా బావి నుండి చెంబుతో నీళ్ళు సేకరించారు.. ప్రతిపక్ష నేతలు ఈ నీళ్ళతో కళ్ళు కడుక్కొని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలం ఎలా ఉందో చూడడండని హిత బోధ చేశారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్లే భూగర్భ జలాలు సంవృద్దిగా నిండి బావులు, బోర్ల నుండి ఇలా నీళ్లు ఉబికి వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే బావి నుండి చెంబుతో నీళ్లు సేకరించి ప్రతిపక్షాల కళ్లు కడుక్కొండని హితబోధ చేయడం చూసి స్థానికులు నివ్వేర బోయారు.
Also read: