Hyderabad: ఓయూ పోలీసులకు చిక్కిన వింత దొంగ.. చోరీ వివరాలు చీటీ రాసి మరీ..!

|

Dec 27, 2023 | 8:31 PM

మహబూబ్‌నగర్‌కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు.

Hyderabad: ఓయూ పోలీసులకు చిక్కిన వింత దొంగ.. చోరీ వివరాలు చీటీ రాసి మరీ..!
Variety Thief
Follow us on

ఓయూ పోలీసులకు ఓ వింత దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు ఈ వెరైటీ దొంగోడు. అలాగే ఆ డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు.పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వింత దొంగ పేరు శంకర్‌ నాయక్‌… తాను దొంగిలించిన సొమ్మును ముత్తూట్ గోల్డ్ లోన్‌లో తాకట్టు పెట్టి హోటల్స్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. మిగిలిన ఆ డబ్బుతో మళ్లీ దొంగతనం చేయడానికి టూవీలర్‌ వెహికిల్స్ కొంటాడు.. ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ శంకర్‌ నాయక్‌. ఎట్టకేలకు ఓయూ పోలీసులకు చిక్కాడు.. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా, శంకర్‌ నాయక్‌ చోరీ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

మహబూబ్‌నగర్‌కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు. అయితే రిమాండ్ చేసిన శంకర్‌ నాయక్‌ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..