Telangana: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ లీడర్ కుమార్తె మృతి.. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో

|

Aug 01, 2022 | 7:31 AM

టీపీసీసీ (TPCC) ముఖ్య నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ శాతంరాయి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా...

Telangana: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ లీడర్ కుమార్తె మృతి.. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో
Congress Leader Firoz Khan
Follow us on

టీపీసీసీ (TPCC) ముఖ్య నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ శాతంరాయి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన (Accident) జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమచారం అందుకున్న స్థానికులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. తానియా తండ్రి ఫిరోజ్ ఖాన్ టీపీసీసీ మైనార్టీ విభాగంలో పాటు నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..