Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బిగ్‌షాక్.. పెరగనున్న బస్సు ఛార్జీలు.. ఎంతంటే?

హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపుపై టీజీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులకు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయం సమకూర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ పేర్కొంది.

Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బిగ్‌షాక్.. పెరగనున్న బస్సు ఛార్జీలు.. ఎంతంటే?
మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్‌-మెట్రో ఏసీ సర్వీసుల్లో అయితే మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి చివరిదాకా రూ.10 అదనంగా ఛార్జీని వసూలు చేయనుంది. పెరిగిన బస్సు ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

Updated on: Oct 04, 2025 | 8:40 PM

హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపుపై టీజీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులకు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయం సమకూర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసీ తాజా ప్రకటన ప్రకారం.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంచనున్నారు. నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు.

మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసులో మొదటి స్టేజికి రూ.5 పెంచనుండగా.. రెండో స్టేజి నుంచి రూ. 10 అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. తాజాగా ఆర్టీసీ పెంచిన ఈ ధరలు సోమవారం( అనగా 6వ) తేదీ నుంచి నుంచి అమల్లోకి రానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.