Vande Bharat: ఇకపై ఆరున్నర గంటలే.! తెలంగాణకు మరో వందేభారత్.. టైమింగ్స్ ఇలా.!!

తెలంగాణకు త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే..

Vande Bharat: ఇకపై ఆరున్నర గంటలే.! తెలంగాణకు మరో వందేభారత్.. టైమింగ్స్ ఇలా.!!
Vande Bharat Express

Updated on: May 27, 2023 | 9:06 AM

తెలంగాణకు త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకు మూడు వందేభారత్ రైళ్లను భారతీయ రైల్వే శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య జనవరిలో ప్రారంభం కాగా, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఏప్రిల్‌లో పట్టాలెక్కింది. మూడోది సికింద్రాబాద్-పూణే మధ్య ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అంతకంటే ముందే నాగ్‌పూర్‌కు ఇది అనుసంధానం కానుంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలును నడిపేందుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య 581 కి.మీ. దూరం ఉండగా.. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంది. ఈ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే రెండు నగరాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత దృడంగా మారుతాయని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుదీర్ ముంగంటివార్ ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసి.. వందేభారత్‌ను కోరారు. ఇక ఈ రైలుకు సంబంధించిన తాత్కాలిక టైం టేబుల్‌ను రైల్వే అధికారులు రూపొందించారు. దాని ప్రకారం ఈ వందేభారత్ నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1:30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్‌ చేరుతుంది.

ఈ రైలు వారంలో 6 రోజులు తిరగనుంది. బల్లార్షా, సిర్పూర్, కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేటల్లో ఆగనుంది. ఇక ఈ వందేభారత్‌లో ఏసీ చైర్ క్లాస్ టికెట్ రూ.1,450– రూ.1,550, ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్ టికెట్ రూ.2,750–రూ.2,850గా ఖరారు చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us