Hyderabad: ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఫోటో ఓపెన్ చేయగా బిత్తరపోయాడు

హైదరాబాద్ నగరంలో ఒక వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం దొంగతనానికి గురైన తన స్కూటర్ తిరిగి దొరుకుతుందని ఆ యజమాని అనుకోలేదు.. కానీ దొంగ చేసిన ఒక చిన్న తప్పు, ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు ఆ వాహనం చిక్కేలా చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఫోటో ఓపెన్ చేయగా బిత్తరపోయాడు
Representative Image

Updated on: Apr 10, 2026 | 5:16 PM

హైదరాబాద్ నివాసి మూడు నెలల క్రితం తన స్కూటర్ దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, వాహనం జాడ దొరకలేదు. అయితే, ఇటీవల సదరు బాధితుడి మొబైల్ ఫోన్‌కు వరుసగా ట్రాఫిక్ చలాన్ల మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. తన వద్ద లేని వాహనానికి చలాన్లు ఎలా వస్తున్నాయని ఆశ్చర్యపోయిన యజమాని, ఆ చలాన్ వివరాలను చెక్ చేయగా దెబ్బకు షాక్ అయ్యాడు. ట్రాఫిక్ చలాన్లలో ఉన్న ఫోటోను గమనించగా, ఒక వ్యక్తి తన దొంగతనానికి గురైన స్కూటర్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ ఫోటోల్లోని ప్రదేశం, సమయాన్ని బట్టి బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. నిఘా కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తి తరచుగా ప్రయాణించే మార్గాలను పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో నిఘా పెంచిన పోలీసులు, చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, వాహనదారులు తమ వాహనాలపై వచ్చే చలాన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. నిఘా కెమెరాల ఏర్పాటు వల్ల నేరగాళ్లను పట్టుకోవడం సులభతరమవుతోందని వెల్లడించారు. దొంగిలించిన వాహనాన్ని యథేచ్ఛగా వాడుతున్న నిందితుడు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడంతోనే పట్టుబడటం విశేషం. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని బాధితుడికి అప్పగించే ప్రక్రియను చేపట్టారు. కాగా, గతంలో వాహనం పోతే దొరకడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నగరవ్యాప్తంగా ఉన్న నిఘా వ్యవస్థ, ఆటోమేటిక్ చలాన్ల ప్రక్రియ నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇది చదవండి: పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..

Follow Us