శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.25 లక్షల బంగారం పట్టివేత!

| Edited By:

Oct 16, 2019 | 4:51 PM

షార్జా నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను  డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. బంగారం అక్రమ రవాణా కానుందనే సమాచారం అందుకున్న డీఆర్‌ఐ వర్గాలు.. పటిష్ఠ నిఘా పెట్టాయి. ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు సోదా చేయగా.. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 652.95 గ్రాముల బరువు… వాటి విలువ రూ .24.61 లక్షలుగా గుర్తించారు. లక్నోకు చెందిన ప్రయాణీకుడిని పరిశీలించినప్పుడు, అతను కస్టమైజ్డ్ జీన్స్ ధరించి ఉన్నట్లు […]

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.25 లక్షల బంగారం పట్టివేత!
Follow us on

షార్జా నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను  డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. బంగారం అక్రమ రవాణా కానుందనే సమాచారం అందుకున్న డీఆర్‌ఐ వర్గాలు.. పటిష్ఠ నిఘా పెట్టాయి. ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు సోదా చేయగా.. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 652.95 గ్రాముల బరువు… వాటి విలువ రూ .24.61 లక్షలుగా గుర్తించారు. లక్నోకు చెందిన ప్రయాణీకుడిని పరిశీలించినప్పుడు, అతను కస్టమైజ్డ్ జీన్స్ ధరించి ఉన్నట్లు తెలిసింది, అందులో పేస్ట్ రూపంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది.