Hyderabad: మద్యం తాగాడు, చికెన్‌ బిర్యానీ తిన్నాడు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఏమైందంటే

|

Jun 23, 2024 | 6:36 AM

ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే హైదారాబాద్‌లో నివాసం ఉండే సోదరిని కలవడానికి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చాడు. సోదరిని అప్పటికే ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లోకి వెళ్లడంతో అడ్రస్‌ ఎక్కడో తెలుసుకునేందుకు ఫోన్‌ చేశాడు. అయితే తాము ఓ విందులో ఉన్నామని, వచ్చేసరికి ఆలస్యమవుతుందని ఆమె తెలిపింది. దీంతో అంతలోపు...

Hyderabad: మద్యం తాగాడు, చికెన్‌ బిర్యానీ తిన్నాడు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఏమైందంటే
Representative Image
Follow us on

హైదరాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. చికెన్ బిర్యానీ తిన్న ఓ వ్యక్తి గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కోఠిలో జరిగింది. వివరాల్లోకివెళితే.. సనుగోముల శ్రీకాంత్‌ (39) స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని అన్నారం గ్రామం.

ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే హైదారాబాద్‌లో నివాసం ఉండే సోదరిని కలవడానికి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చాడు. సోదరిని అప్పటికే ఇల్లు ఖాళీ చేసి మరో ఇంట్లోకి వెళ్లడంతో అడ్రస్‌ ఎక్కడో తెలుసుకునేందుకు ఫోన్‌ చేశాడు. అయితే తాము ఓ విందులో ఉన్నామని, వచ్చేసరికి ఆలస్యమవుతుందని ఆమె తెలిపింది. దీంతో అంతలోపు కోఠిలో ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించిన శ్రీకాంత్‌, అనంతరం చికెన్‌ బిర్యానీ తిన్నాడు.

ఆ తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లక్ష్మీ నగర్‌ కాలనీకి బయలుదేరాడు. అయితే చికెన్‌ బిర్యానీ తిన్నసమయంలో గొంతులో ముక్క ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక ఆటోలోనే కప్పకూలిపోయాడు. దీంతో ఇది గమనించిన ఆటో డ్రైవర్‌ రోడ్డు పక్కనే పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఇది గమనించిన స్థానికులు శనివారాం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీకాంత్ మొబైల్‌లో చివరిగా కాల్‌ చేసిన అతని సోదరికి విషయం తెలిపారు. దీంతో ఆమె వివరాలు వెల్లడించింది. సీసీ టీవీ ఆధారంగా ఆటో డ్రైవర్‌ను పిలిపించి మాట్లడగా.. మద్యం కారణంగా చనిపోయినట్లు భావించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని ఆసుపత్రికి తరలించగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోవడం కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..