
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ కొత్త వీక్లీ టైన్ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చర్లపల్లి – తిరుచానూరు( 17059)
ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 17059 నెంబర్ గల చర్లపల్లి – తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు – చర్లపల్లి (17060)
ఇక తిరుచానూరు తిరుపతి మధ్య రాకపోకలు సాగించే 17060 నెంబర్ గల (తిరుచానూరు – చర్లపల్లి) వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం సాయంత్రం 4:00 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8:00 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట మీరుదగా రాకపోకు సాగిస్తోంది.
అన్ని వర్గాల ప్రయాణికులకు, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ రైలులో మొత్తం 20 కోచ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో స్లీపర్ కోచ్లు, ఏసీ 3-టైర్ కోచ్లు , ఏసీ 2-టైర్ కోచ్లు, జనరల్ కోచ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే షాక పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.