TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. విచారణ ఎప్పుడంటే..

|

Mar 20, 2023 | 12:33 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణ వాయిదా పడింది. కేసు విచారణను రేపటికి వాయిదా వేయాలంటూ బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కరుణాకర్ తెలంగాణ హైకోర్టును కోరారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది కోర్టు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. విచారణ ఎప్పుడంటే..
TSPSC
Follow us on

రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసు రేపటి కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్‌ను మంగళవారం నాటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా ఈ వాదనలు వినిపిస్తారని కోర్టుకు తెలిపారు న్యాయవాది కరుణాకర్. ఇదే కేసులో హైకోర్టు లో పిటిషన్ వేసిన నిరుద్యోగులు. పిటిషన్ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు ఇదే కేసులో నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. కాగా ఈ వ్యవహారంపై సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ ఆదివారంతో ముగిసింది. హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో మొదటి రోజు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రెండోరోజు విచారణలో సిట్ అధికారులు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు నిందితుడు రాజశేఖర్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం