
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఎక్కడలేని వింత ఆచారం కొనసాగుతుంది. 1928 లో ఆలయం నిర్మించినప్పటినుండి ఈ ఆచారం అక్కడ కొనసాగుతుంది.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 98వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండురోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవంలో అందర్నీ ఆకట్టుకునే ఘట్టం ఏమిటంటే దొంగల దోపిడీ మహోత్సవం. ఈ పేరు వినగానే ఆశ్చర్యపోతున్నారు కదా. మరి అలాగే ఉంటుంది ఈ జాతర ప్రత్యేకత కూడా.
శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందుగా చిన్నారులు దొంగలుగా మారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వస్తువులను, ఆభరణాలను దొంగిలించి అదే ఊరిలోని ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్దకు వెళ్లి దాకుంటారు. ఆచారం ప్రకారం గ్రామ పెద్ద మనుషులు గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలతో వెళ్లి దొంగలను పట్టుకొని తాళ్లతో కట్టివేసి గుడికి తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.
అనంతరం స్వామి వారి వద్దకు వెళ్లి మమ్మల్ని క్షమించు స్వామి తప్పు అయిపోయింది మరొకసారి దొంగతనం చేయం అని క్షమాపణ కోరుకొని దేవుణ్ణి ప్రార్ధిస్తారు. చిన్నారులు నిజమైన దొంగల లాగే మారడం దొంగిలించిన స్వామివారికి సొత్తును తిరిగి ఇవ్వడం స్వామివారిని వేడుకోవడం ఈ గట్టమే దొంగల దోపిడీ మహోత్సవం. అయితే ఈ తతంగం తాతల నాటి నుండి వస్తుందని పురోహితుడు తెలిపాడు.
ఈ ఆచారాన్ని కొనసాగించడం వల్ల గ్రామంలో అందరూ క్షేమంగా ఉండి. ఎవరుకూడా దొంగల బారినగాని, మరి ఎలాంటి బాధలు కలుగకుండా ఉండేందుకు దొంగల దోపిడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. చిన్నారులు చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండేందుకు గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు.
వీడియో చూడండి..
;
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.