Telangana: తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంత్రి కిషన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా కూడా కొనసాగుతున్నారు తమిళిసై. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంత్రి కిషన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా కూడా కొనసాగుతున్నారు తమిళిసై. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర రూపాలను సామాన్యులకు పంచిపెట్టారు. దీనినిపై బీఆర్ఎస్ స్పందించి ఉద్దేశపూర్వకంగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం దీనికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీకి పేర్కొంది. దీంతో పాటు మరో కీలక అంశాన్ని పొందుపరిచింది.
Took part in a key voter meeting in Venkateshwara Colony, Banjara Hills, #Hyderabad. The warmth and support from the community were truly heartening. #BJP #Telangana#Election2024 pic.twitter.com/6nYSCIWlyN
ఇవి కూడా చదవండి— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம் ) (@DrTamilisai4BJP) May 7, 2024
మతం ఆధారంగా బీజేపీ పార్టీని ప్రోత్సహించాలని, రామమందిర ప్రతిరూపాలను సామాన్య ప్రజలకు పంపిణీ చేశారని బీఆర్ఎస్ పేర్కొంది. ఇది చట్టవిరుద్దమైన చర్యగా భావించి తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిర రూపాలను పంచడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులు. మతపరమైన చిహ్నాలను పంపిణీ చేయడం ద్వారా ఓ వర్గం ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు తమిళిసై పాల్పడ్డారని పేర్కొంది. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా నిష్పాక్షపాతంగా నిర్వహించేలా చూడాలని బీఆర్ఎస్ ఈసీని కోరింది. తమిళిసై సౌందరరాజన్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
Along with the BJP karyakarthas campaigned for Honb’le Minister of Tourism, Culture and (DoNER) India.@kishanreddybjp garu…#Telangana #Hyderabad pic.twitter.com/k4y8um4nd0
— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம் ) (@DrTamilisai4BJP) May 7, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..