మాజీ రాష్ట్రపతి కలాంకు సీఎం కేసీఆర్ నివాళి
తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. ఆయనతో పాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. రేపు ఉదయం కేసీఆర్ మధురై వెళ్లనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరుతున్న విషయం తెలిసిందే.
తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. ఆయనతో పాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. రేపు ఉదయం కేసీఆర్ మధురై వెళ్లనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరుతున్న విషయం తెలిసిందే.