Chandrayan 3: చంద్రుని ఉపరితలంపై భూకంపం..? ప్రకంపనలను నమోదు చేసిన విక్రమ్ ల్యాండర్.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..

Vibrations on moon: చంద్రయాన్ 3 మరో పెద్ద అప్‌డేట్ పంపించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ప్రకంపనలను నమోదు చేసింది. అయితే, ఇవి ఏ స్థాయిలో ఉంటున్నాయన్నది వెల్లడించలేదు. మరింత లోతుగా పరిశోధనలు చేసే పనిలో విక్రమ్ ల్యాండర్ ఉంది. పూర్తి సమాచారం సేకరించి మరికొన్ని గంటల్లో ఇస్రోకు పంపించనుంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగి నేటికి సరిగ్గా 10 రోజులు పూర్తవుతోంది.

Chandrayan 3: చంద్రుని ఉపరితలంపై భూకంపం..? ప్రకంపనలను నమోదు చేసిన విక్రమ్ ల్యాండర్.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..
Vibrations On Moon

Updated on: Sep 01, 2023 | 7:11 AM

చంద్రయాన్-3.. ఇప్పుడు ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్న పేరు. ప్రయోగం మాత్రమే సంచలనంగా మారలేదు.. చంద్రుడిపై దిగిన విక్రమ్ లాండర్ మనకు పంపిస్తున్న సమాచారం కూడా ఇప్పుడు పెద్ద బ్రేకింగ్‌గా మారుతోంది. తన ప్రతి నిమిషం ఒక్కోరకం టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ప్రకంపనలను నమోదు చేసింది. తన పరిశోధనలో.. విక్రమ్ చంద్రుని ఉపరితలంపై ఐదు సెకన్ల పాటు ప్రకంపనలను నమోదు చేసింది.

చంద్రునిపై ‘భూకంపం’ ఆరోపణ గురించి ఇస్రో, ఈ సహజ దృగ్విషయం చంద్రునిపై నమోదైందని వెల్లడించింది. ప్రజ్ఞాన్ రోవర్, ఇతర పేలోడ్‌లు కూడా దీనికి సంబంధించిన డేటాను ఇస్రోకు పంపాయి. ఇప్పుడు ఈ మొత్తం సంఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.

ప్రపంచానికి తెలియని సహజమైన సంఘటన?

చంద్రునిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ టెక్నాలజీ ఆధారిత పరికరం రోవర్ ఈ మొత్తం కార్యాచరణను రికార్డ్ చేసింది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ సహజంగా కనిపించే ఒక సంఘటనను రికార్డ్ చేసిందని ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండర్ ద్వారా కనుగొనబడిన ఈ మొత్తం విషయాన్ని చంద్రునిపై భూకంపం సంభావ్యతను సూచిస్తుంది. అంటే చంద్రుడిపై ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

అయితే ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉన్నందున ఏదైనా త్వరలోనే తేలనుంది. ఇస్రో ‘అదనంగా, ఇది ఆగస్టు 26, 2023 న సహజ దృగ్విషయాన్ని నమోదు చేసింది. ఈ ఘటనకు గల మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటివరకు చంద్రయాన్ 3 అందించిన అప్‌డేట్ ఇదే..

చంద్రయాన్ 3 బాగా పని చేస్తోంది. చంద్రయాన్-3 చంద్రుడిపైకి చేరి దాదాపు 10 రోజులైంది. ఈ వారంలో.. చంద్రయాన్ చంద్రుని ఉపరితలం నుంచి చాలా ముఖ్యమైన సమాచారాన్ని పంపింది. వీటిలో అత్యంత ముఖ్యమైనది చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రత గురించి పంపిన సమాచారం. చంద్రుని దక్షణ దృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా, చంద్రుని దక్షిణ దృవంపై ఈ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన రికార్డులు కూడా భారతదేశంకే దక్కుతున్నాయి.

చంద్రునిపై ఏమి కనుగొనబడింది..

చంద్రుని ఉపరితలంపై కనిపించే మూలకాల గురించి ఇస్రో గ్రాఫ్ ద్వారా వివరించింది. ISRO ప్రకారం, చంద్రుని ఉపరితలంపై అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఇనుము (Fe), క్రోమియం (Cr), టైటానియం (Ti) ఉనికిని గుర్తించారు. తదుపరి కొలతలు మాంగనీస్ (Mn), సిలికాన్ (Si),  ఆక్సిజన్ (O) ఉనికిని వెల్లడించాయి. హైడ్రోజన్ ఉనికిపై తీవ్రస్థాయిలో పరిశోధన జరుగుతోంది.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us