కరెంట్‌ బిల్లు తక్కువ రావాలంటే.. ACని ఎన్ని పాయింట్లలో వాడాలో తెలుసా?

వేసవిలో AC వాడకం పెరిగింది. సరైన రీతిలో ఉపయోగించకపోతే భారీగా బిల్లులు వస్తాయి. 24-26°C వద్ద ACని సెట్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రత కంప్రెషర్‌పై ఒత్తిడి పెంచుతుంది. సరైన ఉష్ణోగ్రతతో పాటు ఫ్యాన్ వాడకం, కిటికీలు మూయడం వంటి చిట్కాలతో AC బిల్లులను గణనీయంగా తగ్గించవచ్చు.

కరెంట్‌ బిల్లు తక్కువ రావాలంటే.. ACని ఎన్ని పాయింట్లలో వాడాలో తెలుసా?
Ac 2

Updated on: Mar 31, 2026 | 9:00 AM

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ కండిషనర్ (AC) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అయితే సరైన విధంగా ఉపయోగించకపోతే విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న ప్రధాన విషయం ఏమిటంటే.. ఏసీని అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద కాకుండా సమతుల్య స్థాయిలో ఉపయోగించడం ద్వారా గణనీయమైన విద్యుత్ ఆదా సాధ్యమవుతుందని చెబుతున్నారు.

ప్రత్యేకంగా 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఏసీని సెట్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రత పరిధి మన శరీరానికి అనుకూలంగా ఉండటంతో పాటు, విద్యుత్ వినియోగాన్ని కూడా నియంత్రిస్తుంది. చాలా మంది వేడి ఎక్కువగా ఉందనే కారణంతో 18 లేదా 20 డిగ్రీల వద్ద ఏసీని ఉంచుతుంటారు. అయితే ఇలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉపయోగిస్తే కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది, దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. సాంకేతికంగా చూస్తే ఏసీ ఉష్ణోగ్రతను ఒక్క డిగ్రీ తగ్గించినా సుమారు 5 నుంచి 6 శాతం వరకు అదనపు విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా. అందువల్ల సరైన ఉష్ణోగ్రతను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు.

అంతేకాకుండా ఫ్యాన్‌ను ఏసీతో కలిసి ఉపయోగించడం ద్వారా గదిలో చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది, దీని వల్ల ఏసీపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక డోర్లు, కిటికీలు బాగా మూసివేయడం, సూర్యకాంతి నేరుగా గదిలోకి రాకుండా కర్టెన్లు ఉపయోగించడం, ఫిల్టర్లను తరచుగా శుభ్రం చేయడం వంటి చర్యలు కూడా విద్యుత్ ఆదాకు దోహదపడతాయి. మొత్తంగా చూస్తే, ఏసీని సరైన ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం ద్వారా కంఫర్ట్‌తో పాటు విద్యుత్ బిల్లులను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us