తజికిస్తాన్ జైలులో మళ్ళీ పెట్రేగిన హింస
తజికిస్తాన్లోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు హింసాకాండకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జైలు గార్డులు, 29 మంది ఖైదీలు మరణించారు. రాజధాని దుషాంబెకు 10 కిలోమీటర్ల దూరంలోని వాఖ్దత్ పట్టణంలోని జైలులో ముగ్గురు గార్డులను, ఐదుగురు ఖైదీలను పొడిచి చంపారని తజికిస్తాన్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. భద్రతా దళాలు 24 మంది ఉగ్రవాదులను హతమార్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని వారు పేర్కొన్నారు.
తజికిస్తాన్లోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు హింసాకాండకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జైలు గార్డులు, 29 మంది ఖైదీలు మరణించారు. రాజధాని దుషాంబెకు 10 కిలోమీటర్ల దూరంలోని వాఖ్దత్ పట్టణంలోని జైలులో ముగ్గురు గార్డులను, ఐదుగురు ఖైదీలను పొడిచి చంపారని తజికిస్తాన్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. భద్రతా దళాలు 24 మంది ఉగ్రవాదులను హతమార్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని వారు పేర్కొన్నారు.