Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు గ్రాండ్ వెల్‌కమ్.. స్వగ్రామంలో సంబురాలు..

|

Aug 17, 2021 | 12:43 PM

Grand Welcome Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ నీరజ్‌ చోప్రాకు స్వస్థలంలో ఘనస్వాగతం లభించింది. హర్యానా పానిపట్‌లోని త

Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు గ్రాండ్ వెల్‌కమ్.. స్వగ్రామంలో సంబురాలు..
Neeraj Chopra
Follow us on

Grand Welcome Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ నీరజ్‌ చోప్రాకు స్వస్థలంలో ఘనస్వాగతం లభించింది. హర్యానా పానిపట్‌లోని తన స్వగ్రామం సమల్ఖాలో గ్రాండ్‌ వెల్‌కమ్ పలికారు. దారిపొడవునా అతన్ని అభినందిస్తూ ప్రజలు స్వాగతం పలికారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో నీరజ్‌ చోప్రా దేశానికి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకున్నాడు. తన గ్రామస్తులు చూపిన ప్రేమపై నీరజ్‌ హర్షం వ్యక్తం చేశాడు. మీ నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉందని..రానున్న రోజుల్లోనూ తనకు ఇదే తరహా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు మరింత శ్రమిస్తానని నీరజ్ చోప్రా వెల్లడించాడు.

కాగా.. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా బంగారు పతకం గెలవగా.. మీరాబాయి, రవి దహియా రజత పతాకాలు, పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్‌ పునియా కాంస్య పతకాలు సాధించారు. దీంతోపాటు.. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.

Also Read:

ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. దాయాదుల పోరుకు వేదిక ఖరారు..

PM Narendra Modi: నేడు పారా ఒలింపిక్స్‌ క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ.. వీక్షించాలంటూ ట్వీట్..