వన్డేల్లో మళ్లీ ఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇండియా క్రికెటర్ అజింక్యా రహానే. మూడు ఫార్మాట్లోనూ తన స్టామినా ప్రూవ్ చేసుకోవడం కోసం మానసికంగా రెడీ అవుతున్నట్లు తెలిపాడు. వన్డేల్లో ఓపెనింగ్ లేదా నెం.4 స్థానంలో ఆడటానికి రెడీగా ఉన్నట్లు తెలిపాడు.
ప్రజంట్ వన్డేల్లో నెం.4 స్థానంలో ముంబై ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. ఓపెనింగ్ జోడిగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఉన్న సంగతి తెలిసిందే. మూడో స్థానంలో సారథి కోహ్లీ ఉన్నారు. కాగా కెరీర్ మొత్తం 65 టెస్టులు ఆడాడు రహానే. అయితే వన్డే జట్టులో ప్రజంట్ అతడికి ప్లేసు దక్కలేదు. ఇక దాదాపు నాలుగేళ్ల నుంచి టీ20 టీమ్ కు దూరంగా ఉన్నాడు.