ధోనికి చోటు.. కోహ్లీకి ఉద్వాసన!

|

Aug 11, 2019 | 8:35 PM

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్‌ జోన్స్‌ తాజాగా ఆల్‌టైమ్‌ టీ20 క్రికెట్ జట్టును ప్రకటించాడు. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లను అతడు ఈ జట్టులో చేర్చి.. వారు టీ20లు ఆడకపోయినా.. అద్భుతంగా రాణించగలరని కితాబు ఇచ్చాడు. ఓపెనర్లుగా ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ హెడేన్‌, విండీస్‌ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఎంపిక చేయగా… వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌కు మూడో స్థానాన్ని కేటాయించాడు. ఇక భారత్ నుంచి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే చోటు దక్కింది. అటు […]

ధోనికి చోటు.. కోహ్లీకి ఉద్వాసన!
Follow us on

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్‌ జోన్స్‌ తాజాగా ఆల్‌టైమ్‌ టీ20 క్రికెట్ జట్టును ప్రకటించాడు. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లను అతడు ఈ జట్టులో చేర్చి.. వారు టీ20లు ఆడకపోయినా.. అద్భుతంగా రాణించగలరని కితాబు ఇచ్చాడు. ఓపెనర్లుగా ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ హెడేన్‌, విండీస్‌ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఎంపిక చేయగా… వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌కు మూడో స్థానాన్ని కేటాయించాడు. ఇక భారత్ నుంచి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే చోటు దక్కింది. అటు టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ‌కి జోన్స్ చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

డీన్‌ జోన్స్‌ డ్రీమ్‌ టీ20 జట్టు: మాథ్యూ హెడేన్‌, గోర్డన్‌ గ్రీనిడ్జ్‌, సర్‌ వివ్‌ రిచర్డ్స్‌, బ్రియన్‌ లారా, మార్టిన్‌ క్రో, ఇయాన్‌ బోథమ్‌, ఎంఎస్ ధోనీ, షేన్‌ వార్న్‌, వసీం అక్రమ్‌, కర్ట్‌లీ అంబ్రోస్‌, జోయెల్‌ గార్నర్‌