
మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ మార్చి 4న ప్రారంభం కానుంది. కాగా ఈ టోర్నీ చివరి మ్యాచ్ మార్చి 26న జరగనుంది. దీనికి ముందు ఫిబ్రవరి 13న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ వేలంలో ఆటగాళ్లను వివిధ బేస్ ప్రైజ్లో ఉంచారు. మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఆటగాళ్ల గరిష్ట బేస్ ధర రూ.50 లక్షలుగా నిలిచింది.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఆటగాళ్ల గరిష్ట బేస్ ప్రైజ్ రూ.50 లక్షలుగా నిలిచింది. ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, సోఫియా డివైన్, సోఫీ ఎక్లెటన్, అస్లీఫ్ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, నాట్ సీవర్, రేణుకా సింగ్, మెగ్ లానింగ్, పూజా వస్త్రాకర్, దేంద్ర డాటిన్, డేనియల్ వ్యాట్ట్, రిచా ఘోష్, అలిస్సా హీలీ, జెస్ జాన్సన్, స్నేహ రాణా, కేథరిన్ బ్రంట్, మేఘనా సింగ్, డార్సీ బ్రౌన్, లారియన్ ఫిరీ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
? NEWS ?: Women’s Premier League 2023 Player Auction list announced. #WPLAuction
All The Details ? https://t.co/dHfgKymMPN
— Women’s Premier League (WPL) (@wplt20) February 7, 2023
ఫిబ్రవరి 13న ముంబైలో వేలం జరుగుతుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ధృవీకరించారు. ఇది కాకుండా, అరుణ్ ధుమాల్ పీటీఐతో మాట్లాడుతూ, “ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన ఎనిమిది రోజుల తర్వాత ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికాలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26న జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..