CWC 2023: ఇంగ్లండ్‌పై భారత బౌలర్ల అరుదైన రికార్డ్.. వన్డే చరిత్రలో మూడో సారి..

|

Oct 30, 2023 | 8:58 PM

Indian Cricket Team: లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ వికెట్‌లేమీ లేకుండానే 30 పరుగులు చేసింది. అయితే, ఇక్కడి నుంచి వికెట్ల పరంపర మొదలైంది. ఓపెనర్ డేవిడ్ మలన్ (16)ను ఔట్ చేసి జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. దీని తర్వాత, మహ్మద్ షమీ జానీ బెయిర్‌స్టో (14), బెన్ స్టోక్స్ (0)లను అవుట్ చేయడం ద్వారా జట్టుకు రెండు ప్రధాన వికెట్లను అందించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (10) అద్భుతమైన బంతితో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

CWC 2023: ఇంగ్లండ్‌పై భారత బౌలర్ల అరుదైన రికార్డ్.. వన్డే చరిత్రలో మూడో సారి..
Team India
Follow us on

Indian Cricket Team: అక్టోబర్ 29న లక్నోలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 (CWC 2023) 29వ మ్యాచ్‌లో, భారత (Indian Cricket Team) బౌలర్లు ఇంగ్లాండ్‌పై విధ్వంసం సృష్టించారు. భారీ లక్ష్యం లేనప్పటికీ, ఇంగ్లీష్ (Egland Cricket Team) జట్టు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌లను నాశనం చేయడానికి భారత బౌలర్లు ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. వన్డే మ్యాచ్‌లో బౌల్డ్‌ల ద్వారా అత్యధిక సంఖ్యలో బ్యాటర్లను పెవిలియన్ చేర్చిన జట్టుగా తన స్వంత రికార్డును సమం చేసింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, ఈ టోర్నీలో భారత్ తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (87) మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీకి చేరుకోకపోవడంతో జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కాగితంపై, బలమైన ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్ ముందు 230 పరుగుల లక్ష్యం చిన్నదిగా అనిపించింది. కానీ భారత బౌలర్లు భిన్నంగా ఆలోచించి ఈ లక్ష్యాన్ని చాలా పెద్దదిగా చేసి ఇంగ్లండ్ జట్టు 100 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

వన్డే చరిత్రలో భారత్ మూడోసారి ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ వికెట్‌లేమీ లేకుండానే 30 పరుగులు చేసింది. అయితే, ఇక్కడి నుంచి వికెట్ల పరంపర మొదలైంది. ఓపెనర్ డేవిడ్ మలన్ (16)ను ఔట్ చేసి జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. దీని తర్వాత, మహ్మద్ షమీ జానీ బెయిర్‌స్టో (14), బెన్ స్టోక్స్ (0)లను అవుట్ చేయడం ద్వారా జట్టుకు రెండు ప్రధాన వికెట్లను అందించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (10) అద్భుతమైన బంతితో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చివర్లో అదిల్ రషీద్ (13)ను షమీ అవుట్ చేయగా, బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో మార్క్ వుడ్ (0)ను బౌల్డ్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ విధంగా భారత జట్టు ఇంగ్లండ్‌కు చెందిన 6 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి పెవిలియన్‌కు పంపింది.

ఇంతకు ముందు రెండు పర్యాయాలు మాత్రమే వన్డే మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టులోని ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లను భారత్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపింది. 1986లో షార్జాలో శ్రీలంకతో, 1993లో కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..