India vs New Zealand: నేటి (ఆగస్టు 16) నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్కు టీమిండియా పటిష్టమైన జట్టును రంగంలోకి దించనుంది. అంటే బంగ్లాదేశ్తో గత మ్యాచ్లో ఆడిన జట్టునే ఇక్కడ కూడా కొనసాగించే అవకాశం ఉంది.
దీని ప్రకారం టీమిండియాకు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. శుభ్మన్ గిల్ మూడో స్థానంలో ఆడనున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేయడం ఖాయమైంది.
ఐదో నంబర్లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కూడా కనిపించనున్నాడు.
రవీంద్ర జడేజా ఏడవ స్థానంలో ఆడనుండగా, రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో ఆడనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలర్లుగా జట్టులో ఉంటారు. దీని ప్రకారం, టీమ్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
రోహిత్ శర్మ
యశస్వి జైస్వాల్
శుభమాన్ గిల్
విరాట్ కోహ్లీ
కేఎల్ రాహుల్
రిషబ్ పంత్
రవీంద్ర జడేజా
రవిచంద్రన్ అశ్విన్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్
ఆకాష్ దీప్.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మొదటి టెస్ట్ – అక్టోబర్ 16 నుంచి 20 వరకు (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
రెండవ టెస్ట్ – అక్టోబర్ 24 నుంచి 28 వరకు (MCA స్టేడియం, పూణె)
మూడో టెస్టు – నవంబర్ 1 నుంచి 5 వరకు (వాంఖడే స్టేడియం, ముంబై)